సీఎం కేసీఆర్ను విమర్శించిన ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్పై వేటు... !
తెలంగాణ సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ...ఇటివల జరిగిన ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెషన్కు గురయ్యాడు. నాంపల్లి ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ లతీఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ తోమ్మిది నిమిషాల వీడియో ఆయన సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు.
ఇందులో భాగంగానే దళితులకు ముఖ్యమంత్రి,మూడెకరాల భూమి పంపకంతో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానని హామి ఇవ్వడంతోపాటు కేజీ టూ పీజీ ఉచిత విద్యపై లతీఫ్ ఖాన్ ప్రశ్నించారు. కాగా ఖాన్ సివిల్ లిబర్జీస్ మానిటరింగ్ కమిటికి జనరల్ సెక్రటరీగా కూడ ఉన్నారు. దీంతో ఆయన వీడియోను సోషల్ మీడియా అప్లోడ్ చేశారు.
అయితే వీడియోకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వీడియో విడుదల చేయడంపై చర్యలు చేపట్టింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసింది. అయితే తనను సస్పెండ్ చేయడంపై హైకోర్టుకు వెళతానని చెప్పారు.