ఫేస్ బుక్ ద్వారా మహిళకు కుచ్చుటోపీ : 7లక్షలు స్వాహా
పాలకుర్తి : మానవ సంబంధాలన్నీ ఫేస్ బుక్ ఖాతాలతో ముడిపడి పోతున్న నేపథ్యంలో.. ఛాటింగులతోనే స్నేహాలు ఖండాంతరాలు దాటిపోతున్నాయి. అయితే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు.. ఫేస్ బుక్ సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగానే మారిపోతున్నాయి. అమాయకులకు కుచ్చు టోపీ పెట్టడానికే కాచుకు కూర్చునేవారు ఫేస్ బుక్ లో కోకొల్లలలు.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా పాలకుర్తికి చెందిన అనంతోజు రజిత అనే మహిళ ఇదే తరహాలో మోసపోయింది. ఫేస్ బుక్ లో పరిచయమైన టోని మార్క్ అనే అమెరికా వ్యక్తిని గుడ్డిగా నమ్మి రూ.7 లక్షలు ముట్టజెప్పింది. తీరా అతడు మోసం చేశాడని తెలిశాక ఇప్పుడు రజిత బాధ అరణ్య రోదనగా మారింది.
పాలకుర్తి మండల కేంద్రంలో ఉండే రజిత సొంతంగా కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసేది. ఇదే క్రమంలో ఆ ఫోటోలను చూసిన టోని మార్క్ అనే అమెరికా వ్యక్తి సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారంటూ రజితతో ఫేస్ బుక్ లోనే మాటలు కలిపాడు.
అంతేకాదు..
రజిత
సేవా
కార్యక్రమాలకు
తానూ
ఆర్థిక
సహాయం
అందిస్తానని
రజితకు
మాయ
మాటలు
చెప్పాడు.
అయితే
అంతకుముందు
తనకు
ఓ
అత్యవసరం
ఏర్పడిందని..
అందుకు
రూ.7లక్షలు
సర్దాలని
రజితను
కోరగా..
టోనీ
చెప్పినట్లుగానే
అతని
ఖాతాలో
రూ.7లక్షలు
వేసింది
రజిత.
బంధువులు,
స్నేహితుల
వద్ద
అప్పుచేసి
అంత
డబ్బు
తెచ్చిన
రజిత..
తీరా
టోనీ
ప్లేటు
ఫిరాయించడంతో
లబోదిబో
అంటోంది.
తనకు
న్యాయం
జరగకపోతే
ఆత్మహత్యే
శరణ్యమని
వాపోతున్న
రజిత..
ఆఖరికి
పోలీసులకు
ఫిర్యాదు
చేసినా
పట్టించకోవట్లేదని
ఆవేదన
వ్యక్తం
చేసింది.