ఫేస్బుక్ ద్వారా వివాహితను ట్రాప్ చేసి తెచ్చాడు
హైదరాబాద్: ఫేస్బుక్లో పరిచయమైన వివాహితను ట్రాప్ చేసిన కేసులో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలీవాడలో నివాసం ఉండే స్కూల్ అసిస్టెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసిపేట మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిని పాఠశాలలో విధులు నిర్వహించే సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు.
కాసిపేట మండలంలోని ఓ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే ఉపాధ్యాయుడికి ఫేస్బుక్లో హైదరాబాద్కు చెందిన ఓ వివాహితతో పరిచయం కావడంతో ఆ మహిళలను ట్రాప్ చేసి మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంచాడు.
గతంలో అదే మహిళలను మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలోనే కొన్ని రోజులు ఉంచగా సమస్యలు రావడంతో అక్కడి నుంచి మంచిర్యాలలో ఉంచాడు. వివాహిత హైదరాబాద్ వాసి కావడం, ఆమె భర్త అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాలలో ఉన్న వివాహితను గుర్తించిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు.
పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారణ కోసం హైదరాబాద్కు తరలించారు. సదరు ఉపాధ్యాయుడు మొదటి నుంచి యువతలను ట్రాప్ చేయడం లాంటివి చేసేవాడని, తిర్యాణిలో విధులు నిర్వహించే సమయంలో కూడా ఇలాంటి ఘటనలు ఉన్నాయని అంటున్నారు.