కూతుర్ని కత్తితో పొడిచి కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి
నవమాసాలు కని పెంచిన బిడ్డనే కర్కశంగా కడతేర్చింది ఆ తల్లి . అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతుర్నే అత్యంత కర్కశంగా పొడిచి చంపింది. కూతురు చనిపోయాక ఆమె కూడా పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. స్థానికంగా విషాదం నింపిన ఈ సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో జరిగింది.
భాగ్యనగరిలో రెండు రోజుల్లో 4.9 కోట్ల నగదు పట్టివేత ... అవాక్కయ్యేలా ఎక్కడ చూసినా డబ్బే డబ్బు
కొత్తకోట గ్రామానికి చెందిన నిర్మల భర్త నరసింహ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఇక అప్పటి నుండి ఆమె అరేపల్లిలోని పుట్టింట్లోనే ఉంటోంది. కాయకష్టం చేసుకుని బిడ్డను సాకుతుంది. ఈనెల 6న ఉగాది పండుగ కోసం 8 ఏళ్ళ తన కుమార్తె సింధుతో పాటు పాలెంలోని అత్తగారింటికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి ఆమె కుమార్తె సింధును కత్తితో పొడిచి హత్య చేసింది. కుమార్తె మరణించిన తరువాత ఆమె కూడా పురుగుమందు తాగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .
సోమవారం తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు కొన ఊపిరితో ఉన్న నిర్మలను చికిత్స కోసం వనపర్తి జిల్లా హస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఇవాళ ఉదయం మృతిచెందింది. కుమార్తె హత్యకు, నిర్మల ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఐ వివరించారు.
అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భర్త చనిపోయాక నిర్మలకు కుటుంబపోషణ కష్టంగా మారిందని, ఆ కారణంగాకష్టాలు భరించలేకనే తన కూతురు ఎవ్వరికీ భారం కాకూడదని నిర్మల ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు గ్రామస్థులు. అయితే ఆమె పుట్టింటి నుండి అత్తగారింటికి వచ్చిన క్రమంలో ఏమైనా జరిగిందా అన్న కోణం లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.