హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పారాణి ఆరక ముందే నవ దంపతులు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబదా్: కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందిన నవ దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాదులోని కుషాయిగుడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విదంగా ఉన్నాయి.

A Newly-Married Couple Suicide In Hyderabad

కుషాయిగూడలో నూతన దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వెళ్లిన తరువాత భార్యను వేధించేవాడు. అంతే కాకుండ వీరికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన అతను భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత ఇంటిలోని టీవీ పగలగొట్టాడు.

అతని ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. సోమవారం ఉదయం ఇద్దరు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుషాయి గూడ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ఎన్. వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కేసు దర్యాప్తులో ఉందని ఇన్స్ పెక్టర్ వెంకటరమణ తెలిపారు.

English summary
A newly-married couple allegedly committed suicide by hanging themselves at their house in Kushaiguda, police said. They were reportedly found hanging at their residence this afternoon, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X