వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందాక..? ఎప్పటి దాక..? కేసీఆర్, మోదీ మధ్య ముదురుతున్న నిశ్శబ్ద యుద్దం..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం మద్య అంతర్గత విభేదాలు తారా స్తాయిలో నడుతస్తున్నాయా..? ప్రధాని మోదీని కలుసుకునేందుకు విముఖత చూపిస్తున్నారా..? రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎప్పుడు కలవబోతున్నారు..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే రెండు సార్లు ప్రధాని అయిన నరేంద్రమోదీని కలిసే అవకాశం ఉన్నా చంద్రశేఖర్ రావు మాత్రం ఇందుకు సుముఖంగా లేరేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు హాజరుకావాల్సి ఉన్నా విమానం ల్యాండింగ్‌ సమస్య అనే కారణంగా ఆ కార్యక్రమానికి చంద్రశేఖర్ రావు దూరంగా ఉన్నారు.

 తెలంగాణ లో బీజెపి వర్సెస్ టీఆర్ఎస్..! కేసీఆర్ కు మింగుడు పడని రాజకాయం..!!

తెలంగాణ లో బీజెపి వర్సెస్ టీఆర్ఎస్..! కేసీఆర్ కు మింగుడు పడని రాజకాయం..!!

చంద్రశేఖర్ రావు నిజంగానే సాంకేతిక కారణాల వల్ల మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాలేదా లేక మరేదైనా రాజకీయం కారణాలు ఉన్నాయా అనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ కూడా జరిగింది. తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ప్రధానిని కలవడానికి సీఎం చంద్రశేఖర్ రావు నిజంగానే సుముఖంగా లేరేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెళుతున్నారు. కానీ చంద్రశేఖర్ రావు మాత్రం ఈ భేటీకి వెళ్లొద్దని డిసైడయ్యారు.

 ప్రధాని కి ఇవ్వని కాళేశ్వరం ఆహ్వన లేఖ..! కేసీఆర్ మనసులో ఏముంది..!!

ప్రధాని కి ఇవ్వని కాళేశ్వరం ఆహ్వన లేఖ..! కేసీఆర్ మనసులో ఏముంది..!!

పరిపాలనపరమైన కారణాల వల్లే చంద్రశేఖర్ రావు ఢిల్లీ టూర్ వెళ్లడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా దీని వెనుక రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కారణంగానే ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశాన్ని రెండుసార్లు వదులుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రశేఖర్ రావు హాజరై కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తారనే ప్రచారం జరిగింది. అయితే చంద్రశేఖర్ రావు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

 పెరిగిన రాజకీయ వైరం..! కేంద్ర స్థాయిలో చూపిస్తున్న ప్రభావం..!!

పెరిగిన రాజకీయ వైరం..! కేంద్ర స్థాయిలో చూపిస్తున్న ప్రభావం..!!

అయితే చంద్రశేఖర్ రావు, ప్రధాని మోదీ మధ్య పెరిగినట్టు కనిపిస్తున్న గ్యాప్ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తోందనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండటం వల్లే చంద్రశేఖర్ రావు ఆ పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో అనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల నుంచి కేవలం ఐదు నెలల వ్యవధిలోనే లోక్‌సభ స్థానాన్ని గెలుచుకునే స్థాయికి చేరేందుకు దోహదం చేసిన అంశాలను విశ్లేషించుకుంటోంది.

 ప్రధాని ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన కేసీఆర్..! యాదృచ్చికమేనా..?

ప్రధాని ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన కేసీఆర్..! యాదృచ్చికమేనా..?

ఇదే జోష్‌ను కొనసాగిస్తూ క్యాడర్‌ను బలోపేతం చేసుకోవాలని పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. పార్లమెంట్‌ నాటికి ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించింది. జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం కూడా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ అసలు ప్రభావమే చూపలేదు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులా, మోదీ ప్రభావమా అనేది పక్కన పెడితే బలపడేందుకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దనే ఆలోచనతో నాయకులు ఉన్నారు.

English summary
It is doubtful whether Chandrasekhar Rao would be willing to meet Prime Minister Narendra Modi.? Telangana CM Chandrasekhar Rao was to attend the swearing-in ceremony of Prime Minister Modi, who came to power for the second time with absolute majority, but denied to attend the event due to flight landing problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X