వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హొలీరోజున చిన్నారిని చిదిమేసిన రాక్షసుడు.. ఉరితియ్యాలంటున్న బాధితులు

|
Google Oneindia TeluguNews

భాగ్య నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. హోలీ ఆడుకునేందుకు రంగులను ఇప్పిస్తానని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన భాగ్య నగర వాసులను ఉలికిపాటుకు గురిచేసింది. సికింద్రాబాదులోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ సంఘటనపై విచారణ చేసిన పోలీసులకు ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి చెప్పిన సమాచారం షాక్ కు గురి చేసింది. అత్యంత కిరాతకంగా ఒక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ,ఏడుస్తున్న చిన్నారి గొంతులో ఇనుపరాడ్ గుచ్చిమరీ పాశవికంగా కామవాంఛ తీర్చుకుని హత్య చేసిన ఘటన అందరి మనసులను కలచివేసింది.

ఓ భార్య ఘాతుకం ... తాగొచ్చి తిడుతున్నాడని భర్త మర్మావయవాలు కోసేసిందిఓ భార్య ఘాతుకం ... తాగొచ్చి తిడుతున్నాడని భర్త మర్మావయవాలు కోసేసింది

ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం ... హోలీ నాడు దారుణం

ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం ... హోలీ నాడు దారుణం

ఓ మానవ మృగం రెచ్చిపోయింది. ఓ చిన్నారి పై అత్యాచారం చేసి దారుణ హత్య చేసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే మెదక్‌ జిల్లాకు చెందిన దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి అల్వాల్‌లో ఉంటున్నారు. భర్త స్థానికంగా ఉన్న డెయిరీలో పనిచేస్తుండగా.. భార్య చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి కొడుకు (7), కూతురు (6) ఉన్నారు.హోలీ పండుగ నాడు భార్యాభర్తలు ఇద్దరూ పనికి వెళ్ళటంతో ఆ చిన్నారులిద్దరూ చుట్టుపక్కల ఉండే తోటి పిల్లలతో కలిసి రంగులు కొనుక్కొని సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడే బిహార్‌కు చెందిన ధర్మేంద్ర అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు.అతని గదికి వచ్చిన రాజేష్ అనే యువకుడు హోలీ నాడు ఫుల్ గా మద్యం తాగి ఇంటికి సమీపంలో స్నేహితుల తో ఆడుకుంటున్న బాలిక పై కన్నేశాడు .

రంగులు కొనిస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం .. గొంతులో ఇనుప చువ్వ గుచ్చి హత్య

రంగులు కొనిస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం .. గొంతులో ఇనుప చువ్వ గుచ్చి హత్య

చిన్నారితో పాటు అన్నయ్య కూడా ఉండటం గమనించిన రాజేష్ చిన్నారి అన్నయ్యకు రంగులు, స్నాక్స్‌ కొనిచ్చాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఆడుకోవడానికి వెళ్లిపోయాడు. చిన్నారి వద్దకు వెళ్లి తనకు కూడా రంగులు కొనిస్తానని వెంటతీసుకెళ్లాడు. ఆమెను పక్కనే ఉన్న రైల్వేట్రాక్‌ ఆవల 20 మీటర్ల దూరంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిపై రెండుసార్లు పైశాచికంగా అత్యాచారం జరిపాడు. బాధతో ఏడుస్తున్న ఆ చిన్నారి గొంతులో ఇనుప రాడ్ గుచ్చి మరీ అత్యాచారం చేశాడు . ఆ బాలిక ఉసురు తీశాడు. ఆ బాలిక ఏడుస్తున్న, విలవిలలాడుతున్న వదలని కామాంధుడు చివరకు ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు.

ఆరేళ్ళ బాలిక దారుణ హత్య.. రాక్షసుడు రాజేష్ అరెస్ట్

ఆరేళ్ళ బాలిక దారుణ హత్య.. రాక్షసుడు రాజేష్ అరెస్ట్

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఇనుప చువ్వ గొంతులో గుచ్చి మరీ ఆమెను హత్య చేసిన రాక్షసుడు రాజేశ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జీడిమెట్లలోని డీసీపీ కార్యాలయంలో బాలానగర్‌ డీసీపీ పద్మజ ఆ కేసు వివరాలను వెల్లడించారు. ఒక ఆరేళ్ళ చిన్నారి విషయంలో చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఇది . అత్యాచారం చేసి చంపి అక్కడే పొదల్లో పడేసిన పాప మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేసి సదరు కిరాతకుడిని అరెస్టు చేశారు.

English summary
A six-year-old daughter of a daily wage labourer, who went out to celebrate Holi on Thursday, was raped and hacked to death by an intoxicated teenager in Turkapally village here. The girl’s mutilated body was found dumped in the bushes ."When she resisted, he stabbed her using a metal rod. The girl suffered serious injuries, yet the accused raped,"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X