సెల్ఫోన్ కోసమేనా? హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ: ఓ విద్యార్థి మృతి
ఖమ్మం: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి ఒకరు మృతిచెందారు.
వసతి గృహంలోని నాలుగు, పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి జోసెఫ్ (10) మృతిచెందాడు.
పదో తరగతి విద్యార్థి ఒకరు దాడి చేయడంతో జోసెఫ్ మృతి చెంది ఉంటాడనే అనుమానంతో ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జోసెఫ్ మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టినట్లు సమాచారం.
వార్డెన్ ప్రతాప్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్య సెల్ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.
Comments
English summary
A student killed in a hostel in Khammam on Tuesday.
Story first published: Tuesday, October 23, 2018, 20:50 [IST]