రాత్రివేళ స్వామీజీ ఫోన్... గుడ్డిగా నమ్మి మోసపోయిన మహిళ... పోలీసులకు ఫిర్యాదు..
స్వామీజీలు,బాబాలకు మన సమాజంలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో వీళ్ల రాసలీలలు,దందాలు బయటపడినా... ప్రజలు మాత్రం గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ప్రజల బలహీనతలే తమకు ఆశీస్సులుగా ఎంతోమంది కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. మెదక్ జిల్లాలో ఇలాగే పుట్టుకొచ్చిన ఓ స్వామీజీ చేతిలో ఓ అమాయకురాలు మోసపోయింది. లైంగిక దాడికి గురై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
అర్ధరాత్రి హోటల్పై దాడి... రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు...
అసలేం జరిగింది...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్కు చెందిన ఓ మహిళ సంతోషిమాత భక్తురాలు. ఎప్పటినుంచో అమ్మవారికి ఓ గుడి కట్టాలని ఆమె భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఓ స్వామీజీ గురించి తెలిసింది. తమ ప్రాంతంలోనే స్వామి సమర్థ మమరాజ్ అనే స్వామీజీ ఆశ్రమం ఉన్నట్లు తెలుసుకుంది. ఆ స్వామీజీకి చాలా మహిమలు ఉన్నాయని... కోరిన కోరికలు తీరుస్తాడని చాలామంది చెప్పడంతో... ఆ ఆశ్రమానికి వెళ్లింది.
తన సంకల్పం గురించి స్వామీజీకి...
ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అందరి లాగే ఆమె కూడా సాధారణ భక్తురాలిగా స్వామిజీని కలిసింది. సంతోషిమాతకు గుడి కట్టాలన్న తన సంకల్పం గురించి స్వామీజికి వివరించింది. ఆమె సంకల్పానికి ఆశీస్సులు ఇచ్చిన స్వామీజీ... నీ కోరిక తప్పక నెరవేరుతుందని దీవించారు. కానీ ఆ తర్వాత కథ మరో మలుపు తిరిగింది.
రాత్రి వేళ స్వామీజీ ఫోన్
ఓరోజు రాత్రి వేళ ఆ భక్తురాలి సెల్ఫోన్కు స్వామీజీ అనుచరుడు నరేష్ నుంచి ఓ కాల్ వచ్చింది. స్వామీజీ ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. నీ సంకల్పం నెరవేరాలంటే నేను చెప్పినట్లు చేయాలన్నాడు. తాను నరేష్ రూపంలో మీ ఇంటికి వస్తానని... అతని రూపంలో ఉన్న నన్ను సంతృప్తి పరచాలని చెప్పాడు. అలా చేస్తే నీ సంకల్పం నెరవేరుతుందన్నాడు. స్వామీజీ మాటలను ఆ అమాయక భక్తురాలు గుడ్డిగా నమ్మేసింది.
Recommended Video
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ఆ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ స్వామీజీ ఆమెతో ఒట్టు కూడా వేయించుకున్నాడు. అప్పటినుంచి ఆమె స్వామీజీ అనుచరుడు నరేష్కు లైంగికంగా సహకరిస్తూ వచ్చింది. కానీ రోజులు గడుస్తున్నా తన సంకల్పం నెరవేరకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు స్వామీజీతో పాటు నరేష్పై అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.