హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దూసుకొచ్చిన మృత్యువు: పక్క బస్సు రాడ్ గుచ్చుకుని యువకుడి మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో కూర్చొని ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఊహించని విధంగా పక్క బస్సు రాడ్ కిటికీలోంచి దూసుకొచ్చి గొంతులో గుచ్చుకుంది. దీంతో యువకుడు బస్సులోనే విలవిల్లాడుతూ ప్రాణాలొదిలాడు. ఈ ఘటన సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి చౌరస్తాలో చోటుచేసుకుంది.

అంబర్‌పేటలో నివాసముంటున్న ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వి ఈశ్వరరావు(23) కొండాపూర్‌లో విధులు ముగించుకొని, లింగంపల్లి-కోఠి ఆర్డినరీ బస్సు ఎక్కాడు. వెనుక సీటులో కిటికీ పక్కన కూర్చున్నాడు.

రవీంద్రభారతి చౌరస్తా వద్ద ముందున్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఆర్డినరీ బస్సు ఎడమవైపు నుంచి వేగంగా ఓవర్‌టేక్‌ చేసింది. మెట్రో బస్సు కిటికీ అద్దాలకు ఉన్న ఇనుప కడ్డీ... ఆర్డినరీ బస్సును తాకింది. బస్సు వేగానికి అది విరిగిపోయి.. నేరుగా వెనుక సీటులో కూర్చొన్న ఈశ్వరరావు మెడలోంచి దూసుకుపోయింది.

ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఈశ్వరరావు రక్తపుమడుగులో గిలగిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం బస్సు డ్రైవర్ శ్రీనివాసులు అక్కడ్నుంచి పరారయ్యాడు. కాగా, ప్రమాదానికి కారణమైన మెట్రో బస్సు వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

ఆర్టీసీ బస్సులో కూర్చొని ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఊహించని విధంగా పక్క బస్సు రాడ్ కిటికీలోంచి దూసుకొచ్చి గొంతులో గుచ్చుకుంది. దీంతో యువకుడు బస్సులోనే విలవిల్లాడుతూ ప్రాణాలొదిలాడు.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

ఈ ఘటన సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి చౌరస్తాలో చోటుచేసుకుంది.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

అంబర్‌పేటలో నివాసముంటున్న ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వి ఈశ్వరరావు(23) కొండాపూర్‌లో విధులు ముగించుకొని, లింగంపల్లి-కోఠి ఆర్డినరీ బస్సు ఎక్కాడు. వెనుక సీటులో కిటికీ పక్కన కూర్చున్నాడు.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

రవీంద్రభారతి చౌరస్తా వద్ద ముందున్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఆర్డినరీ బస్సు ఎడమవైపు నుంచి వేగంగా ఓవర్‌టేక్‌ చేసింది.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

మెట్రో బస్సు కిటికీ అద్దాలకు ఉన్న ఇనుప కడ్డీ... ఆర్డినరీ బస్సును తాకింది. బస్సు వేగానికి అది విరిగిపోయి.. నేరుగా వెనుక సీటులో కూర్చొన్న ఈశ్వరరావు మెడలోంచి దూసుకుపోయింది.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఈశ్వరరావు రక్తపుమడుగులో గిలగిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

ఘటన అనంతరం బస్సు డ్రైవర్ శ్రీనివాసులు అక్కడ్నుంచి పరారయ్యాడు. కాగా, ప్రమాదానికి కారణమైన మెట్రో బస్సు వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
A youth allegedly killed in RTC Bus in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X