వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నమ్మించి మోసం చేసింది: పురుగుల మందుతాగి ప్రియుడి ఆత్మహత్య
ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహబూబాబాద్: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
మృతుడి కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీఏ పూర్తి చేసిన గూడూరు ఉపేందర్(25) భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన ఓ యువతిని రెండెళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు.
ఖమ్మంలో స్థిరపడితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువతి.. చివరకు తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటాననడంతో ఉపేందర్ మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి కురవి పోలీస్ స్టేషన్ ఎదుట అపస్మారక స్థితిలో ఉన్న ఉపేందర్ను పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
Comments
English summary
A youth committed suicide for girlfriend fraud in Mahabubabad district.
Story first published: Monday, July 31, 2017, 17:41 [IST]