వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీ, ఆటోమొబైల్ షాపులు ఓపెన్, కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా, 17వ తర్వాత లాక్ డౌన్‌పై...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నాలుగు జోన్లలో కరోనా కేసులు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మిగతాచోట్ల కేసులు నమోదు కావడం లేదున్నారు. శనివారం నుంచి ఏసీ విక్రయించే షాపులు, ఆటోమొబైల్స్ షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. కంటోన్మైంట్, బఫర్ జోన్లలో మాత్రం అనుమతి లేదు అని స్పష్టంచేశారు.

కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియదని.. కరోనాతో కలిసి జీవించే వ్యుహం అనుసరించాల్సిందేనన్నారు. వైరస్ ప్రభావం దృష్ట్యా నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. లాక్ డౌన్‌పై 17వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టంచేశారు.

ac, automobile shops will open in telangana

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయని చెప్పారు. దీంతోపాటు వలసకూలీలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మరో 45 బస్తీ దవాఖానాలు నెలకొల్పుతున్నామని కేసీఆర్ తెలిపారు. జూన్ 20వ తేదీ నుంచి హరితహారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రబలిన చోట నివారించేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

English summary
ac, automobile shops will open in telangana saturday onwards cm kcr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X