కేటీఆర్తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, పొగిడారు: ఏసీపీ ఆఫీస్లో రేవంత్ సంతకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డిజి ఏకే ఖాన్ చేరారు. ఎసిబి డిజి ఏకే ఖాన్ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు.
ఉదయం సచివాలయానికి వెళ్లి మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కెటిఆర్కు తెలిపారు. జూకల్ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఏకే ఖాన్ను కెటిఆర్ అభినందించారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ పథకంతో పాటు మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు ప్రభావం కూడా చాలామంది పైన పడుతోంది.
ఇటీవల మహేష్ బాబు ఏపీలోని ఓ గ్రామాన్ని, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు ప్రకాశ్ రాజ్ వెనుకబడిన పాలమూరు జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ముంబైకి మంత్రులు ఈటెల, తలసాని
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వాణిజ్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముంబై బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర, గుజరాత్లో చెక్పోస్టుల పనితీరు, పన్నుల వసూలు, ఏర్పాట్లను మంత్రులు పరిశీలించనున్నారు.
హరీష్ రావును కలిసిన పాలకుర్తి రైతులు
మినిస్టర్స్ క్వార్టర్సులో మంత్రి హరీష్ రావును పాలకుర్తి నియోజకవర్గ రైతులు కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారి వినతి పత్రం ఇచ్చారు. రైతుల వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వాలు దేవాదుల ఫేజ్-1, 2ను నిర్లక్ష్యం ఈ సందర్భంగా హరీష్ రావు మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 8 గ్రామాలకు నీరందిస్తామన్నారు.
సిబిఐ ఆఫీసులో సంతకం పెట్టి వెళ్లిన రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో నిదితుడైన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం ఎసిబి కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఎసిబి కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టి వెళ్లారు.