వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటుపై ఛార్జీషీట్, రేవంత్ సహా 4గురి పేర్లు: 39మంది సాక్షులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) మంగళవారం నాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది.

ఈ ఛార్జీషీటులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్, జెరూసలేం మత్తయ్య పేర్లను పేర్కొంది. తాము 39 మంది సాక్ష్యులను విచారించినట్లు ఛార్జీషీటులో పేర్కొంది.

 ACB files chargesheet in Cash for Vote case

ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లు అరెస్టై నెల రోజుల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. సండ్ర వెంకట వీరయ్యను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ వచ్చింది.

ఈ కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయ్, సండ్ర, ప్రదీప్ చౌదరి, పుల్లారావు, వేం నరేందర్ రెడ్డి, వేం తనయుడు కృష్ణకీర్తన్ రెడ్డి తదితరులను ఎసిబి విచారించింది. 39 మందిని విచారించినట్లు షార్జీషీటులో పేర్కొంది.

English summary
ACB on Tuesday filed its first Chargesheet in the Cash for Vote case against four leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X