ఓటుకు నోటుపై ఛార్జీషీట్, రేవంత్ సహా 4గురి పేర్లు: 39మంది సాక్షులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) మంగళవారం నాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది.
ఈ ఛార్జీషీటులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్, జెరూసలేం మత్తయ్య పేర్లను పేర్కొంది. తాము 39 మంది సాక్ష్యులను విచారించినట్లు ఛార్జీషీటులో పేర్కొంది.
ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లు అరెస్టై నెల రోజుల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. సండ్ర వెంకట వీరయ్యను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ వచ్చింది.
ఈ కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయ్, సండ్ర, ప్రదీప్ చౌదరి, పుల్లారావు, వేం నరేందర్ రెడ్డి, వేం తనయుడు కృష్ణకీర్తన్ రెడ్డి తదితరులను ఎసిబి విచారించింది. 39 మందిని విచారించినట్లు షార్జీషీటులో పేర్కొంది.