వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.30 లక్షలు, నగల కొనుగోలుపై నోరు మెదపని తహశీల్దార్ సుజాత, నేడు మరోసారి విచారణ,అరెస్ట్...?

|
Google Oneindia TeluguNews

షేక్‌పేట భూముల వ్యవహారంలో తహశీల్దార్ సుజాత అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. తన ఇంట్లో దొరికన రూ.30 లక్షల గురించి సుజాత.. పొంతనలేని సమాధానాలు చెబుతుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నిన్న నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన.. ఆ నగదుకు సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు.

నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో అక్రమాలు జరిగింది నిజమేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నగదుతోపాటు నగల కొనుగోలుపై డాక్యుమెంట్స్ లేవు. కానీ జీతం డబ్బులు మాత్రం బ్యాంకు నుంచి విత్ డ్రా చేశానని చెప్పారు. కానీ బ్యాంకు నుంచి తీసిన డబ్బులకు సంబంధించి ఆధారాలు కూడా చూపించలేదు.

acb officials today also enquire mro sujatha

రూ.30 లక్షలు, నగదు కాకుండా మరిన్ని భూములు పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. భూ వ్యవహారంలో సంబంధం ఉన్న అందరినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సుజాత కాల్ రికార్డును పరిశీలిస్తున్నారు.

అందులో ఉన్న వారి పేర్ల ఆధారంగా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్డీవో వసంతకుమారిని విచారించారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్‌ ఎంక్వైరీ గత రెండురోజుల నుంచి కొనసాగుతోంది. సుజాతతోపాటు వీరిద్దరీ స్టేట్ మెంట్లను రికార్డ్ చేశారు. సోమవారం సుజాతను మరోసారి విచారించి.. లంచం కేసులో పాత్ర ఉంది అని తేలితే రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

English summary
acb officials today also enquire mro sujatha for shaikpet land bribe case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X