అక్రమాస్తులు: జడ్జీ ఇళ్లపై ఏసీబీ దాడులు, భారీగా ఆస్తులు
హైదరాబాద్: లేబర్ కోర్టు సెషన్స్ న్యాయమూర్తి ఎం గాంధీ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) శుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మంచి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు సికింద్రాబాద్ వారసిగూడలోని ఆయన నివాసం సోదాలు నిర్వహించారు.
అంతేగాక, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జడ్జీ గాంధీ బంధువులు, కుటుంబసభ్యుల నివాసాల్లోనూ ఏక కాలంలో దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గాంధీపై ఆరోపణలు ఉన్నాయని.. హైకోర్టు అనుమతి తీసుకున్న తరవాతే సోదాలు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని.. పూర్తి వివరాలు సోదాల అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు రూ.3కోట్ల వరకు ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఆయనపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిసింది.
హైదరాబాద్: లేబర్ కోర్టు సెషన్స్ న్యాయమూర్తి ఎం గాంధీ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) శుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మంచి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు సికింద్రాబాద్ వారసిగూడలోని ఆయన నివాసం సోదాలు నిర్వహించారు.
అంతేగాక, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జడ్జీ గాంధీ బంధువులు, కుటుంబసభ్యుల నివాసాల్లోనూ ఏక కాలంలో దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గాంధీపై ఆరోపణలు ఉన్నాయని.. హైకోర్టు అనుమతి తీసుకున్న తరవాతే సోదాలు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని.. పూర్తి వివరాలు సోదాల అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు రూ.3కోట్ల వరకు ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఆయనపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిసింది.