కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ప్రమాదం: నిన్న ఏడుగురు, నేడు ఒకరు
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో గురువారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ వద్ద సొరంగం పనుల్లో గురువారం మరో ప్రమాదం జరిగింది.
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో గురువారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ వద్ద సొరంగం పనుల్లో గురువారం మరో ప్రమాదం జరిగింది.
ఏడుగురి ప్రాణం తీసిన కాళేశ్వరం ప్రాజెక్టు: ఎందుకిలా జరిగింది?
సొరంగంలో బండరాయి మీదపడి ఒక కూలీ మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం ఈ ప్రాజెక్టు పనుల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. మర్నాడే మళ్లీ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రిలో ఎన్కౌంటర్
భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం పోలీసులు, న్యూడెమోక్రసీ మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు న్యూడెమోక్రసీ బృంద సభ్యులు మృతి చెందారు. కూంబింగ్ కొనసాగుతోంది.
సుకుమా జిల్లాలోనూ..
ఛత్తీస్గడ్లోని సుకుమా జిల్లా పిడ్మెల్ అటవీ ప్రాంతంలో గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతుడి వద్ద నుంచి ఒక ఎయిర్గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.