నా భర్త, ఐఏఎస్ రేఖారాణి నుంచి ప్రాణహానీ: నటి పూజిత
హైదరాబాద్: తన భర్త విజయగోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి తనకు ప్రాణహానీ ఉందని సినీ నటి పూజిత మరోసారి ఆరోపించారు. ఆమె మంగళవారం నాడు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
నటి పూజితతో పరిచయం ఇలా..: ఎవరీ ఐఏఎస్ రేఖారాణి, విజయగోపాల్? (పిక్చర్స్)
విడాకులు ఇవ్వకుండానే తన భర్త రేఖారాణిని వివాహం చేసుకున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పూజిత తన ఐడీ ప్రూఫ్, ఇతర వివరాలను పోలీసులకు సమర్పించారని తెలుస్తోంది. తన కుమారుడికి, తనకు న్యాయం జరిగేలా చూడాలని పూజిత కోరారు.
నటి పూజిత తన భర్త విజయ గోపాల్ పైన ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయ గోపాల్ తనను పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత తనకు విడాకులు ఇవ్వకుండానే రేఖారాణిని పెళ్లాడారని ఆమె వారం రోజుల క్రితం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
కాగా, తాను పూజితను అసలు పెళ్లే చేసుకోలేదని విజయ్ గోపాల్ చెప్పారు. ఆమెతో సుమారు పన్నెండేళ్లపాటు సహజీవనం చేశానని, గత ఏడేళ్ల నుంచి పూజితకు దూరంగా ఉంటున్నానని, తమ ఇరువురికి ఒక కొడుకు ఉన్నాడని చెప్పారు.
విడిపోయారు, సహజీవం చేశారు: 'నటి పూజిత'పై ఐఏఎస్ అధికారిణి
తనపై ఆరోపణలకు దిగిన పూజిత ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పూజిత తన నుంచి ఏం కోరుకుంటుందో తెలియట్లేదన్నారు. పూజిత వెనక ఎవరో ఉన్నారని, వారి మాటలు వినే పూజిత తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. రేఖారాణి కూడా తాను అన్నీ చూసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నానని, పూజిత - విజయ గోపాల్ పెళ్లి చేసుకోలేదని, దానిని తాను నిర్ధారించుకున్నానని వివరణ ఇచ్చారు.