ఫాంహౌస్ నుంచి హైదరాబాద్కు కేసీఆర్: మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలకు పిలుపు
హైదరాబాద్: మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎరవలి సమీపంలో ఏర్పాటు చేసుకున్న తన ఫాం హౌస్లో తెలంగాణ సీఎం కేసీఆర్ సేదతీరే సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకుని వెంటనే హైదరాబాద్కు వచ్చేస్తుంటారు.
కానీ, ఈ సారి మాత్రం ఏకంగా ఐదు రోజుల పాటు ఆయన ఫాం హౌస్లో గడిపారు. గత వారం ఫాం హౌస్కు వెళ్లిన కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం దాటిన తర్వాత హైదరాబాద్కు పయనమయ్యారు.
తన వ్వవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఈసారి చేస్తున్న అల్లం సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లం సాగుపై కూలీలకు, ఫాంహౌస్ పర్యవేక్షకులకు పలు సలహాలు, సూచనలు చేసిన ఆయన బయలుదేరే ముందు కూడా అల్లం సాగు పనులను చూసి వచ్చారట.
ఇక, హైదరాబాద్ వచ్చీ రాగానే కేబినెట్ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓ సమాచారం పంపారట. తక్షణమే హైదరాబాద్కు రావాలని ఆయన తన సందేశంలో మంత్రులతో పాటు పార్టీ తరుపున ఎన్నికైన ప్రతినిధులను కోరారని తెలుస్తోంది.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలతో కేసీఆర్ సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.