ఘోరం: ఇవాంకా వస్తోందని.. వీధి కుక్కలకు విషమిచ్చి..., ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్
నగరంలో అంతర్జాతీయ సదస్సులో నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకొని వాటికి విషం ఇచ్చి చంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ : నగరంలో అంతర్జాతీయ సదస్సులో నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకొని వాటికి విషం ఇచ్చి చంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Recommended Video
హైదరాబాద్ లో జరిగే జీఈఎస్ లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాంకా కాన్వాయ్ తిరగనున్న బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వీధికుక్కలను జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టుకెళుతున్నారు.
పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?
నగరంలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆ మూగజీవాలకు విషం ఇచ్చి చంపేస్తున్నారని నగరంలోని జంతు సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తుండగా.. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు తాము విషం ఇవ్వడం లేదని చెబుతున్నారు.
యాడంగ వస్తందో.. యానంగ పోతదో: హోంమంత్రి నాయిని, ఇవాంకా టూర్ షెడ్యూల్లో మార్పు!?
వీధికుక్కలను తీసుకువెళ్లి వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసి డీవార్మింగ్, యాంటీరాబీస్ వ్యాక్సిన్ ఇచ్చి తిరిగి వాటిని వదిలివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తాము 'మా ఇంటి నేస్తం' పేరిట వీధి కుక్కల దత్తతకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టామంటూ వివరిస్తున్నారు.
ఖండించిన కేటీఆర్...
మరోవైపు ఈ విషయమై దక్కన్ క్రానికల్ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఖండించారు. ఇది పూర్తిగా అసత్యమని, ఇలాంటి వార్తలు ప్రచురణకు ముందు జీహెచ్ఎంసీ అధికారుల వివరణ తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
Absolute Nonsense & downright ridiculous report @DeccanChronicle
— KTR (@KTRTRS) November 22, 2017
No minimum decency or journalistic values to get the version of GHMC before you publish trash like this ??? https://t.co/GeVWatUk8h