సొంత నియోకవర్గంలో నటుడు, ఎమ్మెల్యే బాబు మోహన్కు షాక్, ఇదీ లిస్ట్!
ఆందోల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబు మోహన్కు చేదు. సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేటలో ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తమ నగర పంచాయతీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఛైర్పర్సన్ కవిత సురేందర్ గౌడ్ ఆరోపించారు.
నగర పంచాయతీలో రూ.7 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన టెండర్లను ఇప్పటికే ఖరారయినప్పటికీ బాబు మోహన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయమై తాము ఇప్పటికే బాబు మోహన్ను కలిసి వివరించి చెప్పామని కవిత సురేందర్ అన్నారు. అయినా ఆయన తన తీరును మార్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో బాబు మోహన్ అడ్డుకున్న పనుల లిస్టుని తయారు చేసి, పాలకవర్గం సభ్యులు ప్రజలకు పంచారు.
అందోల్-జోగిపేట నగర పంచాయితీలో అయిదేళ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేదని ఆమె అన్నారు. అధికారులను బెదిరించి ఏ పనులు చేయకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనుల గురించి తమ పాలకవర్గం బాబు మోహన్ను కలిసి వివరించినా ఎలాంటి ఫలితం లేదన్నారు. దీంతో విసిగిపోయి ఆయన తీరును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగినట్టు తెలిపారు.