శ్రీమంతుల బాటలో: జుకల్ గ్రామస్తులతో ఏసిబి డీజీ ఏకె ఖాన్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామాన్ని గురువారం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఏకే ఖాన్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై గ్రామస్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. భేటీ సందర్భంగా గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన గ్రామస్తులతో చర్చలు జరిపారు.
ఇటీవలే ఏకె ఖాన్.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావును కలిసి జుకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో గురువారం పర్యటించారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులు వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ డీజీ జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇటీవలే ప్రముఖ సినీనటులు మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ మహబూబ్నగర్ జిల్లాలోని రెండు వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకున్నారు.