వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ ..ఒకే వేదికపై అమిత్‌షా, పవన్ కళ్యాణ్ .. కారణమిదే

|
Google Oneindia TeluguNews

త్వరలో బీజేపీలో కీలక నేత అమిత్ షా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద మాట్లాడబోతున్నారు. బీజేపీ, జనసేనల మధ్య ఉన్న బంధాన్ని తెలియజెయ్యటంతో పాటు వారిరువురూ ఒకే అంశంపై తమ ఉమ్మడి అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యనున్నారు . తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అమిత్ షా , పవన్ లు ఇద్దరూ పాల్గొననున్నారు. అందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తుంది బీజేపీ .

 ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్ ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్

మార్చి 14వతేదీన ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ

మార్చి 14వతేదీన ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ

కేంద్ర సర్కార్ లో బీజేపీలో కీలక నేతగా భావిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్చి నెల 14వతేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఒకే వేదిక మీద కనిపించనున్నారు. ఇప్పటి వరకు బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఇంత కాలం అయినా కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఇక తాజాగా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం నిర్ణయం , వైసీపీ బీజేపీకి సన్నిహితంగా మెలగటం జనసేనకు తలనొప్పిగా మారాయి. ఆదిలోనే మైత్రీ బంధానికి చెక్ పెడుతుంది అని ప్రచారం జోరుగా సాగింది.

బీజేపీ , జనసేన పొత్తుపై అనుమానాలు .. సభతో సమాధానం చెప్పనున్న పార్టీలు

బీజేపీ , జనసేన పొత్తుపై అనుమానాలు .. సభతో సమాధానం చెప్పనున్న పార్టీలు


ఇక తమ బంధం బలంగా ఉందని త్వరలోనే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తామని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పినా సరే ప్రజల్లో వీరి పొత్తుపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో సీఏఏ పై అవగాహన కల్పించటం కోసం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఒకే వేదిక మీద అమిత్ షా మరియు పవన్ సీఏఏ , ఎన్నార్సీలపై రెండు పార్టీల ఉమ్మడి అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు .

సీఏఏ అవగాహనకు బీజేపీ భారీ బహిరంగ సభ

సీఏఏ అవగాహనకు బీజేపీ భారీ బహిరంగ సభ

భారతీయ పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణా సర్కార్ సైతం సీఏఏ ను వ్యతిరేకిస్తూ క్యాబినెట్ లో తీర్మానం చేసింది. ఇక బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు అనుకూలంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నారు. మతపరమైన ఎలాంటి అంశాలకు దీనిలో తావు లేదని చెప్తున్నారు.

Recommended Video

Pawan Kalyan Angry Speech On Jagan Decision || AP 3 Capitals Issue || Oneindia Telugu
సభలో మాట్లాడనున్న అమిత్ షా , పవన్ కళ్యాణ్ లు

సభలో మాట్లాడనున్న అమిత్ షా , పవన్ కళ్యాణ్ లు


ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీని కోసం ఎల్బీ స్టేడియంలో మార్చి నెల 14వతేదీన బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్‌షా ను , మిత్ర పక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరో విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. ఇప్పటికే పవన్ కూడా సీఏఏ కు మద్దతు తెలుపగా తెలంగాణ నేతల కార్యచరణ ముందుకు రావడంతో సభకు వస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో అమిత్ షా , పవన్ లు ఒకే వేదిక మీద కనిపించనున్నారు .

English summary
Soon BJP's key leader Amit Shah and Janasena Party chief Pawan Kalyan will be speaking on the one platform. The relationship between the BJP and the Jana Sena has been revealed and the two will be sharing their views on the CAA, NRC issue. Both Amit Shah and Pawan will attend a public meeting organized by the BJP in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X