వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ మాజీ మంత్రికి అనసూయ క్షమాపణలు: ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్నకు ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ క్షమాపణలు చెప్పారు. సేవ్ నల్లమల ఫారెస్ట్ ప్రచారంలో భాగంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన అనసూయ.. గత ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్నను ట్యాగ్ చేశారు.

అయితే, ఆమెకు ప్రస్తుత అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అని తెలియదు. దీంతో జోగు రామన్నను ట్యాగ్ చేసి.. యురేనియం తవ్వకాలను నిలిపేసి.. అడవులను కాపాడాలంటూ కోరారు. అయితే, తర్వాత తన తప్పును తెలుసుకున్న అనసూయ.. మరో ట్వీట్ చేసి సరిదిద్దుకున్నారు.

 anasuya bharadwaj apologises to telangana former minister

Recommended Video

Anasuya Bharadwaj Fires On Netizens || ఎమోషనల్ అయిన అనసూయ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్నకు క్షమాపణలు చెప్పారు. తనకు కరెంటు అఫైర్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని.. ప్రస్తుత అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ట్యాగ్ చేశారు.

కాగా, ఇప్పటికే యురేనియం తవ్వకాలను జరపవద్దని, నల్లమల అడవులను కాపాడాలంటూ సినీప్రముఖులు విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, సమంత, వరుణ్ తేజ్ లాంటి నటులు ఇప్పటికే ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

English summary
Cine Actress Anasuya Bharadwaj apologises to telangana former minister Jogu Ramanna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X