హైదరాబాద్లో మరో 227 బస్తీ దవాఖానాలు, మూడునెలల్లో అందుబాటులోకి: మంత్రి కేటీఆర్
ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పేదలకు ఆరోగ్య శ్రీతో వైద్యం అందిస్తోంది. దీనికితోడు బస్తీ దవాఖానలకు ప్రయారిటీ ఇస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో 123 బస్తీ దవాఖానలు ఉండగా.. మరో 227 దవాఖానలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 227 మంది బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. అందుకోసమే.. మరిన్ని ఆస్పత్రులను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.
227 బస్తీ దవాఖానలు మరో 3 నెలల్లో అందుబాటులోకి మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొత్తగా ఏర్పడే బస్తీ దవాఖానలతో ప్రతీ పేదకు వైద్యం అందుతోందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 వార్డులు ఉన్నాయి. 350 బస్తీ దవాఖానలు పనిచేస్తాయి. ఒక్కో బస్తీకి రెండు చొప్పున ఆస్పత్రులు సేవలు అందించనున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లలేని వారికి బస్తీ దవాఖానలతో మేలు జరగనుంది.