పెళ్లికి రండి: ఏపీ మంత్రి అఖిలప్రియకు కేటీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ గురువారం కలిశారు. తనకు కాబోయే భర్త భార్గవ్తో కలిసి ఆమె కేటీఆర్ వద్దకు వెళ్లారు.
ఆగస్టు 29న జరగబోయే తమ వివాహానికి రావాలని కేటీఆర్ను వారిద్దరూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాబోయే దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా వారికి జ్ఞాపికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోను కేటీఆర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఘనంగా మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం: వరుడు ఎవరో తెలుసా?
Congratulated Tourism Minister from Andhra Pradesh @bhuma_akhila Garu who called on me along with her fiancé Bhargav to extend an invitation to her wedding
— KTR (@KTRTRS) May 24, 2018
Her mother Late Smt. Shobha Nagireddy Garu was my colleague in AP Legislative assembly from 2009-14 pic.twitter.com/h2lGHASmvx
మే 12న అఖిలప్రియ నిశ్చితార్థం పారిశ్రామికవేత్త భార్గవ్తో హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అఖిలప్రియ తల్లి, దివంగత భూమా శోభా నాగిరెడ్డి 2009-2014 మధ్య ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తన సహచర సభ్యురాలని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.