ప్రయివేట్ వోల్వో బస్సులో మంటలు, కిందకు దూకిన ప్రయాణీకులు
హైదరాబాద్: సోమవారం ఉదయం హైదరాబాద్ శివారులో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రయివేటు వోల్వో ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అప్రమత్తం కావడంతో బస్సు కొంత వేగంలో ఉండగానే కొందరు ప్రయాణీకులు కిందకు దూకారు.
బస్సు దగ్ధం, బంతిగా భావించి బాంబు పట్టుకున్న బాలుడు: విశాఖలో తోటకు తప్పిన ప్రమాదం
ఈ సంఘటన కీసర సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాదు నుంచి ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తోంది. కీసర వద్దకు చేరుకోగానే బస్సులో ఉన్నట్లుండి మంటలు వచ్చాయి. అప్పటికే చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు.
మెలకువగా ఉన్న కొందరు మంటలు రావడాన్ని గుర్తించారు. బస్సులో మంటలు చెలరేగిన విషయాన్ని డ్రైవర్కు చెప్పారు. వారు నిద్రలో ఉన్న ప్రయాణీకులను లేపారు. అంతా కలిసి బస్సులో నుంచి కిందకు దిగారు.
చెన్నై వరదలు: సూపర్ బస్సు డ్రైవర్ (వీడియో)డ్రైవర్ బస్సును ఓ పక్కకు ఆపేశాడు. అది ఆగగానే మంటలు దహించాయి. దీంతో నడిరోడ్డుపై బస్సు పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రయాణీకుల లగేజీ కూడా కాలిపోయింది. ప్రయాణీకులను మరో బస్సులో హైదరాబాద్ తరలించారు.