తల్లితో పరిచయం: కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ అధికారి
హైదరాబాద్ నగరంలో మరో దారున ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఆర్మీ అధికారి అత్యాచారానికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఆర్మీ అధికారి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. షామీర్పేట్లోని డీఆర్డీవోలో పాలనాధికారిగా పనిచేస్తున్న రిషిశర్మ(44)కు రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్పల్లికి చెందిన ఓ మహిళ(42)తో పరిచయం ఏర్పడింది.
సదరు మహిళ భర్తతో విడిపోయి కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటోంది. గత జనవరిలో ఒకరోజు రాత్రి రిషిశర్మ ఆ మహిళ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆ మహిళ కుమార్తె(19) ఒక్కతే ఇంట్లో ఉంది. కాగా, రిషి.. ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి పలుసార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.
కాగా, బాధిత యువతి గర్భం దాల్చింది. ఈ విషయం రిషిశర్మకు చెప్పడంతో గర్భం తీసేయొద్దని హెచ్చరించాడు. దీంతో సోమవారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రిషిని అరెస్టుచేసి కోర్టుకు తరలించారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు సమాచారం.