బీజేపీ ఎక్కడుందో కవితను అడిగితే తెలుస్తోంది.. లక్ష్మణ్
బీజేపీ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించాడు. రాష్ట్రంలో టీర్ఎస్ ఎక్కడుందని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, అయితే నిజామాబాద్లో ఓడిపోయిన కవితను అడిగితే బీజేపీ ఎక్కడుందో చెబతారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డా కూడ తనకు ఎవరో తెలియదని చెప్పడంతో ఆయన అహాంకారాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. కేటీఆర్ వలే ఆయన పార్టీ పునాదులు లేకుండా రాలేదని, కేటీఆర్లాగా తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లో రాలేదని మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించబోతుందని, దీంతో టీఆర్ఎస్ నిద్రలేని రాత్రులు గడిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన విమర్శలు చేశారు. ఈ నేఫథ్యంలోనే రోజుకో మాట మాట్లడే తత్వం టీఆర్ఎస్ పార్టీదని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సభలో నడ్డా వేసిన ప్రశ్నలు నిజమో కాదో టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయగా మారిందని ఆరోపణలు చేసిన ఆయన మరోసారి కాలేశ్వరం ప్రాజెక్టులో డీపీఆర్ లేకుండా టెండర్ల ప్రక్రియ చేపట్టారని ప్రశ్నించారు.
ఇక బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.హైదరాబాద్ మురికికూపంగా మార్చిన ఘనత కేసీఆర్దే నని మండిపడ్డారు. తమది ఫామ్హౌజ్ పాలన కాదని, తెలంగాణలో మోదీ తరహా పాలన అందిస్తామని తెలిపారు.