వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏది అడిగినా మోడీ "ఛాయ్" అనే సమాధానమే చెబుతారు: అక్బరుద్దీన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మజ్లిస్ నేతలు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ప్రధాని ఛాయ్ కామెంట్స్ పై చాంద్రాయణ గుట్ట తాజామాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. ప్రధాని మోడీ ఛాయ్ కహానీ వినీ వినీ వేశారిపోయామని అన్నారు.

twitter link:

బీజేపీ మజ్లిస్ నేతలు ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారని ముందు ముస్లింలకు వారు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని ప్రసంగంలో ఏమైనా చెబుతారా అని ఆసక్తిగా వింటే అందులో ఛాయ్, ఛాయ్ ఛాయ్ తప్ప ఏమీ కనిపించదు వినిపించదు అని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు గురించి అడిగితే... నరేంద్ర మోడీ, టీ ఎన్ని రకాలుగా ఉంటుందో చెబుతారని విమర్శించారు. చిక్కటి టీ, కెటెల్ టీ, నీళ్ల టీ, టీ స్టవ్ ఇలాంటివి చెబుతారని ఆయన ఒక దేశానికి ప్రధానా లేక ఇంకేమైనానా అంటూ విమర్శంచారు.

Attacking Modi, Owaisis brother says chai 19 times in 1 minute

ఒకప్పుడు మోడీ టీ అమ్ముకునేవారే... కాని ఇప్పుడు దేశానికి ప్రధాని అని ఆ విషయం గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు అక్బరుద్దీన్. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను విడిచి వెళ్లి పోవాలని యోగీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు అక్బరుద్దీన్ ఓవైసీ. తమ తర్వాత మరో వెయ్యి తరాలు హైదరాబాదులోనే ఉంటాయని ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 7న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా... ఫలితాలు డిసెంబర్ 11న వెలువడుతాయి.

English summary
If you ever invite Akbaruddin Owaisi over for tea, well...maybe give him coffee instead.What's wrong with a cup of steaming, spicy chai, you wonder? Nothing. It's just that Akbaruddin, the MLA from Chandrayangutta, sounds rather tired of hearing about it -- specifically, in the context of Prime Minister Narendra Modi's rise from humble origins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X