బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్కు దేహశుద్ది
గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్గా పనిచేస్తున్న సర్వర్ అనే వ్యక్తి దారి తప్పాడు. అదే స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఎలాగోలా ఆ నరరూప రాక్షసుడి బారి నుంచి తప్పించుకున్న సదరు బాలిక ఇంటికి వెళ్లాక.. అటెండర్ తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో ఓపిక పట్టారు. సోమవారం నాడు ఉదయం ఆ చిన్నారి పేరెంట్స్ తో పాటు కాలనీవాసులు స్కూల్కు వెళ్లి అటెండర్ ను నిలదీశారు. అనంతరం దేహశుద్ది చేశారు. హెడ్ మాస్టర్ స్వరూప్చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్కూల్ కు వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్లు.. రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్
అటెండర్ సర్వర్ గతంలోనూ ఇలాగే ప్రవర్తించినట్లు తమ కూతురు చెప్పిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే అప్పుడు భయపడి ఆ విషయం తమతో చెప్పలేదని తెలిపారు. శనివారం నాడు వెకిలి చేష్టలు వేయడంతో స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చిందని.. ఏమైందని ఆరా తీయడంతో జరిగిన విషయం చెప్పిందన్నారు.
పిల్లలను చదివించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు స్థానిక విద్యార్థి సంఘాల నేతలు. అటెండర్ తీరుకు నిరసనగా స్కూల్ ఎదుట ఎమ్మార్పీఎస్ నేతలు ధర్నా చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.