పోలింగ్ బూత్ వద్ద కవితకు చేదు అనుభవం ...ఏం చేశారంటూ నిలదీసిన మహిళల వీడియో వైరల్
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత కు పోలింగ్ బూత్ వద్ద ఎదురైంది. బోధన్ నియోజకవర్గంలోని తన ఓటు హక్కు వినియోగించుకున్న కవితను అక్కడ క్యూలో నిలబడి ఓటు వేయడానికి వచ్చిన మహిళలు నిలదీశారు. కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యారని, ఇప్పటివరకు ఏం చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉలిక్కిపడిన జనగామ జిల్లా.. సమ్మక్క ఆలయం వద్ద నరబలి ?
కవితను నిలదీస్తున్న మహిళల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గత ఐదేళ్ల పాలనలో తమ కోసం ఏం చేశారో చెప్పాలంటూ, ఏ మాత్రం అభివృద్ధి జరిగిందో చూపించాలంటూ మహిళలు కవితను నిలదీస్తు న్నప్పటికీ కవిత చాలా ప్రశాంతంగా వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కవిత అక్కడినుండి వెళ్లి పోయారు.