వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 వరకు బడ్జెట్ సెషన్ .. రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టాక .. స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం జరిగింది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలనే అంశంపై చర్చ జరిగింది. సమావేశానికి పార్టీ ఎల్పీ నేతలు హాజరయ్యారు.

bac confirms telangana assemnley will contiue 25th feb

25 వరకు సెషన్
మరో రెండు రోజుల సభ నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శనివారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి పద్మారావు ఒక్కరి పేరే వినిపిస్తోంది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చను ప్రారంభిస్తారు స్పీకర్. వివిధ పక్షాల నేతలు పద్దుపై తమ వాణి వినిపిస్తారు. ఆదివారం సభకు సెలవు ఉండటంతో తిరిగి సోమవారం సెషన్ ప్రారంభమవుతోంది.

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
తిరిగి సోమవారం బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఆర్థికమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ పద్దుపై సమాధానం చెపుతారు. బడ్జెట్ ను ఆమోదించాలని కోరడంతో సభ్యుల వినతి మేరకు స్పీకర్ ఆమోదిస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును కూడా సభలో ప్రవేశపెడతారు. బిల్లుకు సభ ఆమోదం తెలుపడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మనుగడలోకి వస్తోంది.

English summary
The decision was taken at a Business Advisory Committee meeting for another two-day assembley session. Saturday will be the deputy speaker's election process. Former minister Padma rao is the name of the party from the ruling party. His election will be a formal one. Then the speaker will start a debate on the budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X