టీఆర్ఎస్ ఎంఐఎం చెంచా .. చీకట్లో ప్రేమించుకుంటూ బయట డ్రామాలు : బండి సంజయ్ ధ్వజం
జిహెచ్ఎంసి ఎన్నికలలో మేయర్ , డిప్యూటీ మేయర్ ఎంపికపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి లో టిఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈరోజు మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ కు ఎంఐఎం పార్టీకి మద్య అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైంది అని, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ చెప్పిన విషయమే నిజమైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తోపుగాడు ఏం కాదు, బడా చోర్ సీఎం .. భద్రకాళీ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా ? బండి సంజయ్ సవాల్
బయటకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల రాజకీయం
టీఆర్ఎస్ ,ఎంఐఎం రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ బయటకు వేరు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రెండూ కలిసి పోటీ చేయకపోతే టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ పక్క మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం పార్టీకి చెంచా అని ఈరోజు రుజువైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. లోపల ఒప్పందాలు చేసుకొని బయటకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల సమయంలో పెద్ద సీన్ క్రియేట్ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు.
నీతివంతమైన రాజకీయాలు చేస్తే బహిరంగంగానే పొత్తు పెట్టుకోవాలి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సిగ్గులేకుండా మేము వేరు వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని, నీతివంతమైన రాజకీయాలు చేయాలనుకుంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకోవాల్సింది కానీ ఇలా చీకటి రాజకీయాలు చేయడం కాదని సంజయ్ విమర్శించారు. టిఆర్ఎస్ , ఎంఐఎం రెండు పార్టీలు కలిసి దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించిన బండి సంజయ్ బిజెపి నుండి గెలిచిన కార్పొరేటర్లు హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని పేర్కొన్నారు.
పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా కబ్జా చేసినా ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతాం
పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా కబ్జా చేసినా ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ నీచ రాజకీయాలను సహించరని చెప్పిన బండి సంజయ్, ప్రజలకు అవకాశం వచ్చిన ప్రతిసారి కర్రు కాల్చి వాత పెడుతూనే ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ , కాంగ్రెస్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికపై కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు .