రూ. 50 కోట్ల ల్యాండ్ లంచం కేసు: ఎమ్మార్వో సుజాత అరెస్ట్ ఇప్పటికే ఆర్ఐ, ఎస్ఐ అరెస్ట్
హైదరాబాద్: మూడు రోజుల విచారణ అనంతరం బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
కాగా, ఇప్పటికే ఈ కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ రవీంద్ర నాయక్ను అధికారులు రిమాండ్కు తరలించారు. తహసీల్దార్ అరెస్టుతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. తహసీల్దార్ నివాసంలో దొరికిన రూ. 30 లక్షల నగదు అంశంపైనా విచారణ జరుగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్లో రూ. 50 కోట్ల విలువైన భూ వివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఖలీద్ అనే వ్యక్తి నుంచి ఆర్ఐ నాగార్జున రెడ్డి రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ఖలీద్ ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం నుంచి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.
రూ. 15 లక్షలు లంచం తీసుకుంటున్న ఆర్ఐని, కేసు మాఫీ చేస్తానంటూ రూ. 3 లక్షల డిమాండ్ చేసిన ఎస్ఐ రవీంద్రనాయక్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లోతుగా విచారణ జరిపిన ఏసీబీ అధికారులకు షేక్పేట్ మండల తహసీల్దార్ సుజాత పాత్ర వెలుగులోకి వచ్చింది. మూడు రోజులపాటు సోదాలు చేయడంతోపాటు విచారణ జరిపారు. ఏసీబీ సోదాల్లో తహసీల్దార్ నివాసంలో రూ. 30 లక్షల నగదుతోపాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులు చివరకు ఎంఆర్ఓ సుజాన్ను కూడా అరెస్ట్ చేశారు.