శిరీష కేసులో ట్విస్ట్: ఇంత చిన్న విషయానికే.. తేజస్విని ఏం చెప్పిందంటే..
బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో తేజస్విని స్టేట్మెంటును బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రికార్డు చేశారు. రెండు పేజీల స్టేట్మెంటును పోలీసులు రికార్డు చేశారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో తేజస్విని స్టేట్మెంటును బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రికార్డు చేశారు. రెండు పేజీల స్టేట్మెంటును పోలీసులు రికార్డు చేశారు. శిరీష ఆత్మహత్య ఎంతో బాధ కలిగించిందన్నారు.
శిరీష మృతి కేసులో తేజస్విని పేరు కూడా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. రాజీవ్ను శిరీష పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత రాజీవ్కు తేజస్వినితో పరిచయమైంది.
తేజస్విని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రాజీవ్ కోసం తేజస్విని, శిరీషల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తేజస్విని స్టేట్మంట్ రికార్డు చేశారు.
ఇంత చిన్న విషయానికే..
బ్యూటీషియన్ శిరీష ఇంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఏమాత్రం అనుకోలేదని తేజస్విని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంటులో పేర్కొన్నారు. ఇది ఊహించని విషయమని అందులో తెలిపారు.
రాజీవ్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా
తాను రాజీవ్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని తేజస్విని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంటులో తెలిపారు. శిరీష అడ్డు రావడంతో రాజీవ్ వెనుకడుగు వేశాడని ఆమె తెలిపారు.
శిరీషతో ఫోన్లో మాట్లాడా..
రాజీవ్కు తెలియకుండా తాను చాలాసార్లు ఫోన్లో మాట్లాడానని తేజస్విని తన స్టేట్మెంటులో పేర్కొన్నారు. ఆమెతో ఈ విషయమై గొడవ కూడా పడ్డామని చెప్పారు. ఇరువురం పరస్పరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నామని చెప్పారు.
రాజీవ్ కోసమే బెంగళూరు నుంచి వచ్చా
తాను రాజీవ్ కోసమే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చానని తేజస్విని తన స్టేట్మెంటులో పేర్కొన్నారు. రాజీవ్ కోసం శిరీష - తేజస్వినిలు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ఈమె స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. కాగా,ఈ కేసులో విచారణ నిమిత్తం బంజారాహిల్స్కు వచ్చిన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. మంగళవారం రాజీవ్, శ్రవణ్ల రిమాండ్ గడువు ముగియడంతో మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.