రైతుబంధు పథకంలో లబ్ది దారులా.. ఐతే రేషన్ బంద్..! ఆదేశాలు జారీ చేసిన టీ సర్కార్..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఎకరాకు పదివేలు ఇస్తోందని సంబరపడుతున్నారా..? ఐతే ప్రభుత్వం ఈ పథకానికి ఓ మెలికపెట్టబోతోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న లబ్దిదారులు కొన్ని త్యాగాలు చేయాల్సిఉంటుంది. ఇంతకాలం చాలామందిని సంతోషానికి గురి చేసిన ఈ పథకమే ఇపుడు ఇబ్బందిని కలిగించబోతోంది.
వాంటెడ్ ... రైతులు కావలెను .. 20 వేల ఆకర్షణీయమైన జీతం,భోజనవసతి
ఈ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. అంతేకాదు దీన్ని ఆధారంగా చేసుకుని ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలకు బ్రేకులు వేయాలనుకుంటుంది తెలంగాణ సర్కార్. పదెకరాల పొలం ఉండి, పెట్టుబడి సాయం తీసుకుంటున్న రైతులకు ఈ నెల నుంచి రేషన్ సరుకులు బంద్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సరుకులు రద్దు కావడం అంటే కార్డులు రద్దు చేయడం. కార్డులు రద్దు చేయడం అంటే... అనేక ప్రభుత్వ పథకాలకు అనర్హులు కావడమే. కాబట్టి ఈ రేషన్ కార్డు రద్దు విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు. చాలా మంది తమ ఆదాయం తక్కువ గా చూపుతూ రేషన్ కార్డు తీసుకున్నారు. రేషన్ పొందుతున్నారు.
వీరిలో పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అధికంగా ఆదాయం ఉన్న వారిని పౌర సరఫరాల శాఖ ఏరిపారేస్తోంది. దీనికి రైతు బంధును ఆధారంగా చేసుకోవడం విశేషం. ఇది ఒకరకంగా బోగస్ వివరాలను పొందుపరిచి అక్రమంగా ప్రభుత్వ పథకాలకు గండికొడుతున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్టుగా పౌర సరఫరాల శాఖ అదికారులు వివరణ ఇస్తున్నారు.