హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీహార్ దోపిడీ దొంగల అరెస్ట్: 24తులాల బంగారం సీజ్(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగారం దోపిడీ చేస్తున్న బీహార్ ముఠా సభ్యులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ముఠా సభ్యులను ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆయన వివరాలను తెలిపారు.

బీహార్ రాష్ర్టానికి చెందిన గంగారాం మండల్ (27), పింటూ మండల్, బిజయ్ మండల్, మోటే సూర్యసాగర్ ముఠా సభ్యులుగా ఏర్పడ్డారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గంగారాం బంజారాహిల్స్‌లోని అతిథి గెస్ట్ హౌస్‌లో నివాసముంటుండగా, పింటూ జూబ్లీహిల్స్, సూర్యసాగర్ న్యూబోయిగూడ, సికింద్రాబాద్‌లో నివాసముంటున్నాడు.

Bihar thieves arrested in Hyderabad

బంజారాహిల్స్ నవీన్ నగర్‌లో నివాసముంటున్న రంగనాయకులు (84) వద్ద గంగారాం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యజమాని ఓ శుభాకార్యానికి వెళ్లిన సమయంలో మాస్టర్ బెడ్‌రూమ్‌లోని అల్మారాలోని 36 తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు.

పింటూ, బిజయ్, సూర్యసాగర్‌ను ఆ ఆభరణాలను విక్రయించే క్రమంలో గురువారం మాధాపూర్ ప్రాంతంలో తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపగా దొంగతనం విషయాన్ని వెల్లడించారు.

Bihar thieves arrested in Hyderabad

నిందితుల వద్ద నుంచి 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని, గంగారాం, పింటూ, సూర్యసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బిజయ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.

English summary
Bihar thieves arrested in Hyderabad on Thursday and some gold seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X