చీడపురుగు: కేసీఆర్పై బాబు మోహన్ నిప్పులు, ‘ఆందోల్లో బీజేపీ జెండా ఎగరేస్తాం’
ఆందోల్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు అని తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్ విమర్శించారు. బుధవారం జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని బాబు మోహన్ ప్రారంభించారు.
హరీశ్ వల్లే టీఆర్ఎస్! కేసీఆరే నా గాడ్ఫాదర్, కానీ..: బాబు మోహన్ ఆవేదన
అనంతరం బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దళితుల్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ నలుగురు దళితులను మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని అన్నారు.
బీజేపీకి దళితుడ్ని పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ఘనత ఉందని బాబు మోహన్ చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు సూది, దారం, చెక్కర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మహా మహా రాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. బీజేపీ జెండా ఆందోళ్ నియోజకవర్గంలో ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ.. డబ్బు, మద్యానికి దూరమని ఆయన చెప్పారు.