టిడిపికి బిజెపి షాక్: ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి
టిడిపికి షాకిచ్చేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఎల్ బి నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను బిజెపిలో చేరాలని ఆ పార్టీ నేత , మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సంప్రదింపులు జరిపారు.
హైదరాబాద్: టిడిపికి షాకిచ్చేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఎల్ బి నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను బిజెపిలో చేరాలని ఆ పార్టీ నేత , మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సంప్రదింపులు జరిపారు.తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తున్న సమయంలోనే ఘటన చోటుచేసుకోవడం ఆసక్తి కల్గిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరించుకొనేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీలకు చెందిన నాయకులతో బిజెపి సంప్రదింపులు చేస్తోంది.
అయితే సోమవారంనాడు ఎల్ బి నగర్ ఆర్. కృష్ణయ్యతో పురంధేశ్వరి సుమారు గంటపాటు సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.కృష్ణయ్యను పార్టీలో చేరాలని ఆమె ఆహ్వానించింది.
అయితే ఈ విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకొంటానని కృష్ణయ్య చెప్పినట్టు సమాచారం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో బిజెపి నాయకులు పార్టీలో చేరికలపై చర్చిస్తున్నారు.
ఈ ఏడాది చివరినాటికి ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరికలు ఉండే అవకాశం ఉంది.అయితే ఈ విషయమై ఇతర పార్టీల నాయకులతో బిజెపి సంప్రదింపులు జరుపుతోంది.అయితే రానున్న రోజుల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.అయితే టిడిపితో పొత్తును గత ఎన్నికల సందర్భంగా బిజెపి నాయకత్వం వ్యతిరేకించింది. అయితే జాతీయ అవసరాల రీత్యా బిజెపి టిడిపితో పొత్తును కుదుర్చుకొంది.