శ్రీరాముడు, గోమాత దయవల్ల: తనకు, కుటుంబసభ్యులకు నెగిటివ్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇటీవల అతని గన్ మెన్కు పాజిటివ్ రావడంతో.. ఆయన ఫ్యామిలీతో సహా హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయగా రాజాసింగ్, కుటుంబసభ్యులకు నెగిటివ్ వచ్చింది. దీంతో అతను శ్రీరాముడు, గోమాత వల్ల తమకు వైరస్ రాలేదుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గన్ మెన్కు వైరస్ వచ్చిందని తెలియగానే ఆందోళన చెందామని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ క్షేమాన్ని కోరిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమకు కరోనా నెగిటివ్ వచ్చిందని, తమకు అండగా నిలిచినందుకు మరోసారి థాంక్స్ చెప్పారు. ఇటీవల రాజాసింగ్ గన్మెన్కు కరోనా వైరస్ వచ్చిందని తెలియడంతో ఎమ్మెల్యేను కలిసినవారు కూడా ఆందోళన చెందారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఆరాతీశారు. అయితే పరీక్షలో నెగిటివ్ రావడంతో.. వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. నిన్న 700 పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొన్న 500 పైచిలుకు కేసులు రికార్డయ్యాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే మెజార్టీ కేసులు పాజిటివ్ వస్తున్నాయి. ఇటీవల ప్రైవేట్ ల్యాబ్లకు కూడా పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వడం, ఎక్కువ పరీక్షలు చేయడంతో.. రోజురోజుకు వైరస్ కేసులు పెరుగుతున్నాయి.