'జయలలితకు పట్టిన గతే కెసిఆర్ కు, 20 నెలలపాటు ప్రభుత్వం కాపాడుకొంటే గొప్పే'
వచ్చే 20 మాసాల పాటు ప్రభుత్వం కాపాడుకొంటే టిఆర్ఎస్ కు గొప్పే అని బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్:వచ్చే 20 మాసాల పాటు ప్రభుత్వం కాపాడుకొంటే టిఆర్ఎస్ కు గొప్పే అని బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే 20 ఏళ్ళ పాటు తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉంటారని చెబుతున్నారని, 20 ఏళ్ళు కాదు, వచ్చే 20 నెలలపాటు అధికారాన్ని కాపాడుకోవడం గొప్పేనని చెప్పారు.
ఆదివారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో జయలలితకు పట్టిన గతే కెసిఆర్ కుటుంబానికి పడుతోందన్నారు.
తెలంగాణలో వచ్చే 20 ఏళ్ళు టిఆర్ఎస్ దేనని హారీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.సెక్రటేరియట్ లో అడుగుపెట్టకుండా అపరిష్కృతంగా పేరుకుపోయిన ఫైళ్ళను చూసి మీకు 20 ఏళ్ళు అధికారం ఇవ్వాలా అని ఆయన ప్రశ్నించారు.
టిఆర్ఎస్ అవినీతిపై బిజెపి శాసనసభపక్ష నాయకుడు కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలను మాట్లాడే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
మంత్రి హారీష్ రావు ఊచలు లెక్కపెట్టడానికి సిద్దంగా ఉండాలని చెప్పారు.టిఆర్ఎస్ నేతలకు కళ్ళుమూసినా తెరిచినా మోడీ, అమిత్ షా లే కన్పిస్తున్నారని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.త్వరలోనే కెసిఆర్ అవినీతిని బయటపెడతామన్నారు.