మళ్లీ బీజేపి అదికారంలోకి రావడం ఖాయం..! నిజామాబాద్ లో అమీత్ షా...!!
నిజామాబాద్ :నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో జరిగిన బీజేపి క్లస్టర్ సమావేశానికి ముఖ్య అతిదిగా హాజరైప బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై ఘాటుగా స్పందించారు. సమావేశం తర్వాత, తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని షా అన్నారు. మరోసారి మోడీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. పది మందితో ప్రారంభమై 15కోట్ల సభ్యులున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం భాజపా అని తెలిపారు. ఏడాదికి 6వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను సంతోషంగా ఉంచటమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని తెలిపారు.
దేశాన్ని రక్షించే సత్తా ఉన్న నాయకుడు మోదీ మాత్రమే అని షా తెలిపారు. . కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అసోం నుంచి గుజరాత్ వరకు గెలుపే లక్ష్యంగా భాజపా పని చేస్తుందని షా అన్నారు. ఓవైసీ తో కలిసి కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని. తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు చేయడం లేదని షా నిలదీసారు. కేసీఆర్ మీద పోరాటం పూర్తి కాలేదని, ప్రజల కోసం ఆ పోరాటం ఇంకా కొనసాగుతుందని అమీత్ షా వివరించారు. త్వరలో లోక్ సభకు జరిగే ఎన్నికలు ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కాదని, ప్రధాన మంత్రిని ఎన్నుకునేందుకు జరుగుతున్నాయని, కాబట్టి తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని అమిత్ షా తెలంగాణ ప్రజానికానికి తెలిపారు.