కవిత చేయలేని అభివృద్దిని అర్వింద్ చేసీ చూపిస్తాడు... రాంమాధవ్
Recommended Video
తెలంగాణలో ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టి, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్.. కాగా దేశంలో భాజపా రికార్డు పాలన సాగిస్తుందన్నారు . గత ఐదేళ్లలో కవిత చేయలేని అభివృద్ధిని ఎంపీ అర్వింద్ చేసి చూపిస్తారని స్పష్టం చేశారు.
ఈనేపథ్యంలోనే తెలంగాణలో మరింత బలమైన శక్తిగా మారుతామని అన్నారు. గడిచిన ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణ నుండి బీజేపీ ప్రభంజనం ఆరంభమైందని అన్నారు. నిజామాబాద్ లో, ఎంపీ అర్వింద్ విజయం సంధర్బంగా ఏర్పాటు చేసిన కృతజ్ఝతా సభలో ఆయన పాల్గోన్నారు.
ఈనేపథ్యంలో పసుపు రైతుల సమస్యల్ని తర్వలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా భవిష్యత్తు లేదన్నారు. ఇక దేశ భవిష్యత్ నరేంద్ర మోడీ హాయాంలోనే సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలు కూడ నిర్ణయించారని అన్నారు. కాగా ఈ సభలో బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ తోపాటు ఇతర పార్టీ నేతలు పాల్గోన్నారు.