ముస్లీం రిజర్వేషన్ బిల్లు: టైర్లలో గాలి తీసేశారు, బీజేవైఎం నేతల అరెస్ట్
తెలంగాణలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రాధాన్య అంశంగా ఆదివారం జరగనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బిల్లులను ప్రవేశపెడుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రాధాన్య అంశంగా ఆదివారం జరగనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బిల్లులను ప్రవేశపెడుతోంది.
ముస్లీం రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు బీజేవైఎం ఆదివారం ఆందోళనకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ గేట్ వద్ద పలువురు నేతలు నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టైర్లలో గాలి తీసేశారు
రాణిగంజ్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు రెండుమూడు వాహనాలలో గాలి తీసేశారు. రాజ్యాంగ వ్యతిరేకమైన మతప్రాతిపదిక రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వారు ఈ చర్యకు పాల్పడ్డారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
మతప్రాదిపదికన రిజర్వేషన్లను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వారు పాదయాత్ర నిర్వహిస్తారు.
బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న బీజేవైఎం నాయకుల అరెస్ట్ పిరికిపందల చర్య అని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని, దీనిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ సభ్యులు కోటకొండ రాము డి మాండ్ చేశారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో కన్వినర్ ఆంజనేయులు, సభ్యులు మల్లేష్, జోనల్ ఇనచార్జీ రాజు, బాలకృష్ణ, నవీన, యుగేందర్, గోపాల్రాజ్ తదితరులు పొల్గొన్నారు.