తెలంగాణలో రాయలసీమా ! ,నాటు బాంబులతో రాజకీయ దాడులు
నల్లగొండ మరో రాయలసీమగా మారనుందా ? దాడులు ప్రతి దాడులతోపాటు ,తెలంగాణలో ఎక్కడాలేని విధంగా నాటుబాంబులతో దాడులు ఎందుకు చేసుకుంటున్నారు. రాజకీయంగా పక్కరాష్ట్ర్రాల సంస్కృతిని నల్గోండ నాయకులు కొనసాగిస్తున్నారా, ఇది ఎక్కడవరకు వెళుతుంది.
తెలంగాణలో ఎన్నికలు పూర్తయినా రాజకీయాలు ఇంకా రాజకీయా కక్షలు కొనసాగుతున్నాయి..ఇటివల జరిగిన ఎన్నికల్లో జరిగిన గొడవలు చిలికి చిలికి గాలివానగా మారాయి.దీంతో గ్రామస్థులు నాటు బాంబులు విసురుకునే వరకు వెళ్లింది.
తాజాగానల్గోండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో రాజకీయ కక్షలు చెలరేగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన గొడవలు ఇంకా ఆగ్రామంలో రగులుతున్నాయి. ఈనేపథ్యంలోనే గత రాత్రి నుండి నాయకుని తండాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ,పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. ఈనేపథ్యంలోనే ఇరుపక్షాలు నాటు బాంబులతో దాడులు చేసుకున్నాయి. దీంతో సుమారు 20 ఇళ్ల వరకు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా వారిని అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.