హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహిత దారుణ హత్య: అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శివరాంపల్లిలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్య వెలుగుచూసింది. శుక్రవారం రాత్రి 10.40గం. సమయంలో .. అక్కడి ముళ్లపొదళ్లో ఓ మృతదేహం తగలబడుతుందంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగింది హత్యేనని, వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు పట్టకుండా ఉండటం కోసం ఆమె ముఖంపై బండరాయితో మోది, మృతదేహానికి నిప్పంటించినట్టు గుర్తించారు.

Brutal murder of a married woman in shivrampalli

రాత్రి 7గం. సమయంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో మహిళకు సంబంధించిన నల్లపూసలు, చెప్పులు దొరికాయన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ రిపోర్టు నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులను వీలైనంత తొందరగా పట్టుకుంటామని అన్నారు.

English summary
A married woman was brutally killed by unknown persons in Shivrampally.This incident came to light on Friday night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X