బీటెక్ స్టూడెంట్ సాత్విక్ రెడ్డి మిస్సింగ్: కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులు..
ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి సాత్విక్ రెడ్డి అదృశ్యమయ్యాడు.
హైదరాబాద్: ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి సాత్విక్ రెడ్డి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ సహారా ఎస్టేట్ కాలనీలో అతని కుటుంబం నివాసముంటోంది.
బుధవారం ఉదయం 8గం.కు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సాత్విక్ రెడ్డి.. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సాత్విక్ తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కాగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విద్యాసాగర్ రెడ్డి తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో స్థిరపడ్డాడు. సాత్విక్ రెడ్డి మిస్సింగ్తో అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Comments
English summary
Satwik Reddy, B.Tech student of Srinidhi Engineering college was missed two days back. Police searching for him.
Story first published: Friday, October 13, 2017, 13:08 [IST]