ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంతెనపైనుంచి బోల్తా పడిన బస్సు: 10మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సారపాక-నాగినేనిప్రోలు మార్గంలో ఆర్టీసీ బస్సు వాగు వంతెనపైనుంచి అదుపు తప్పి బోల్తా పడింది.

శనివారం ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్డుపై గుంతలను తప్పించబోయి బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పది మందికి గాయాలైనట్లు తెలిసింది.

Bus accident in Reddypalem: 10 injured

పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా, భారీ వర్షాలతో జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

English summary
10 passangers injured in a bus accudent occurred at Reddypalem in Bhadradri Kothagudem district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X