వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు ప్రతిష్టాత్మక అవార్డు, కేటీఆర్‌కు లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన్ను ఈ సంస్థ ఇచ్చే లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది.

కేటీఆర్‌కు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఇది మరో ప్రతిష్టాత్మక అవార్డు. ఈ అవార్డును డిసెంబర్ 20వ తారీఖున ఢిల్లీలో జరగనున్న జాతీయ స్మార్ట్ సిటీ సదస్సులో ప్రదానం చేయనుంది.

Business World Awards for Telangana State and KTR

దీంతో పాటు ఉత్తమ పట్టణ మౌలిక వసతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. ఇందుకోసం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.

ఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ యవనికపై నిలిపిన తీరుపై స్పందించిన ఆ మీడియా సంస్థ.. కేటీఆర్‌ను అభినందించింది. ఈ అవార్డులను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అందించనున్నారు.

English summary
Telangana State has been adjudged as the State with best urban infrastructure by prominent publication Business World. Municipal Administration and Urban Development Minister KT Rama Rao also has been declared winner of the ‘Leader of the Year’ award by the national business weekly. The awards will be presented at the Fifth National Smart City Conference to be held in New Delhi on December 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X